వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాలు, ఆపండి!: సీఎంలకు కేంద్రమంత్రి, కేటీఆర్‌తో కేసీఆర్‌కు సంకేతాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం.

ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ప్రమాదముందని ఓ కేంద్రమంత్రి పరోక్ష సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. అదే జరిగితే ఈ వ్యవహారం ముగిసిపోవచ్చు.

మరోవైపు, ఫోన్‌ ట్యాపింగ్‌పై తమకు లభించిన ఆధారాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్‌ చేసిందంటూ కేంద్రానికి ఏపీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ చేసి నివేదిక రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. ట్యాపింగ్‌ తీవ్రమైన నేరమని, కేసీఆర్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని అని కేంద్రం అభిప్రాయపడుతున్నట్లుగా చెబుతున్నారు.

Union Minister warns KCR and Chandrababu?

ఇదిలా ఉండగా, టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా గురువారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ట్యాపింగ్‌ జరిగిన తీరు, సెక్షన్‌ 8పై గవర్నర్‌ మౌనం గురించి సుజనా వివరించారు.

బుధవారం సుజనా చౌదరి సమక్షంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను పిలిపించి ట్యాపింగ్‌పై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గురువారం వెంకయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూడా వెంకయ్య ట్యాపింగ్‌ గురించి ప్రస్తావించినట్లు సమాచారం.

కేటీఆర్ ద్వారా కేసీఆర్‌కు ఆయన కీలక సందేశం పంపించారని కూడా అంటున్నారు. మరోవైపు టెలికమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ కూడా తనను కలిసిన కేటీఆర్‌తో ట్యాపింగ్‌ గురించి ప్రస్తావించారని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఫోన్లు ట్యాప్‌ చేశారని రుజువైతే కేసీఆర్‌ న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారమని వార్తలు వస్తున్నాయి. ఇంతటితో ఆపేయాలని, రచ్చ చేసుకోవద్దని సూచించారని తెలుస్తోంది.

మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే కేంద్ర బృందంలో ఒకరైన హోం శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ గురువారం సాయంత్రం హోం శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై హోం మంత్రికి కూడా ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Union Minister warns KCR and Chandrababu?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X