పరిపూర్ణానందస్వామికి క్షమాపణలు చెప్పాలి, ప్రభుత్వానికి డిమాండ్
హైదరాబాద్: శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిని నగరం నుంచి బహిష్కరించిన అంశంపై హిందువుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు గురువారం హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
హైదరాబాదుతో పాటు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. హైదరాబాదులోని ఆరాంఘర్ వద్ద చేపట్టిన ధర్నా కారణంగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.

విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అమీర్ పేట మైత్రివనం వద్ద కూడా రాస్తారోకో నిర్వహించారు. కోఠి సెంటర్లో విహెచ్పీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
స్వామీజీని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిందూ సమాజాన్ని అవమానించిందని, ఆయనపై బహిష్కరణను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం స్వామీజికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి, ఆయనను రాష్ట్రంలోకి ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మేడ్చల్, వరంగల్ తదితర పలుచోట్ల కూడా విశ్వహిందూ పరిషత్, బీజేపీ, బజరంగ్ దళ్, హిందూవాహిని నిరసన చేపట్టాయి. రహదారులను ముట్టడించడంతో పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications