కాల్పుల కేసు: వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే, అనంతపురం ముఠాకి సుపారీ, భార్యకు తర్ఫీదు
కాంగ్రెస్ పార్టీ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్ గౌడ్ను పోలీసులు చేర్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్ గౌడ్ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు.
వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ అదుపులో అనంతపురానికి చెందిన ముఠా ఉంది. పట్టుబడ్డ నిందితులను పోలీసులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పలు అనుమానాలతో ప్రారంభమైన ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విక్రమ్ గౌడ్ కావాలనే ఇలా చేయించినట్లు తెలిసింది.

ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్ గౌడ్కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.
మొత్తానికి సానుభూతిని సంపాదించుకునేందుకు విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్ గౌడ్పై ఆరోపణలు వస్తున్నాయి.
ఉదయం టాస్క్ఫోర్స్ సోదాల్లో ఒక పిస్టల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications