వీల్ చైర్లో కోర్టుకు విక్రమ్ గౌడ్, ఖరీదైన బిఎండబ్ల్యు కారు సీజ్
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో పోలీసులు ఆయన బిఎండబ్ల్యు కారును సీజ్ చేశారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో పోలీసులు ఆయన బిఎండబ్ల్యు కారును సీజ్ చేశారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వీల్ చైర్లోనే ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
అనంతరం అరెస్టు చేశారు. నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం ఆయన కాల్పుల డ్రామా ఆడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకున్న విక్రమ్ ఈ రోజు డిశ్చార్జ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విక్రంను అపోలో ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండు విధించింది. చికిత్సకు అనుమతి ఇచ్చింది.
పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు, అక్రమ ఆయుధాన్ని కల్గి దాన్ని ఉపయోగించిన ఘటనలో ఎనిమిది మందిపై కేసులు నమోదుచేసిన పోలీసులు.. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్న విక్రమ్తో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications