నాపై కాల్పులు జరిపారు, కఠినంగా శిక్షించాలి: పోలీసులకు విక్రమ్ వాంగ్మూలం ఇదే
తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు.
హైదరాబాద్: తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్పారు.
దుండగులు కాల్పులు జరపగానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరినట్లు చెప్పారు. తన అరుపులు విన్న భార్య షిపాలి కిందకు వచ్చిందని, వెంటనే 108కు ఫోన్ చేయాలని ఆమెకు సూచించినట్లు తెలిపాడు.

నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే తాను శుక్రవారం మాట్లాడలేకపోయానని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ తెలిపారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు విక్రమ్.
పోలీసులు ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నప్పటికీ విక్రమ్ గౌడ్ తన వాంగ్మూలంలో ఇలా చెప్పడంతో పోలీసులు మరో కోణంలో విచారించాల్సిన అవసరం ఏర్పడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications