ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు.

డిసెంబర్ 15న ఖచ్చితంగా హాజరుకావాలని ఏసీబీ కోర్టు వారిని ఆదేశించింది. హాజరు మినహాయింపు పిటిషన్లను పిటిషన్లను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గాఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులు ప్రధాన సూత్రధారిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications