మెట్రో రైలు ఆలస్యానికి సీఎం కారణం, టిఆర్ఎస్ అంతు చూస్తాం: ఉత్తమ్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్ళిన తమ పార్టీ నేతలను అడ్డుకోవడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తప్పుబట్టారు.2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ అంతు చూస్తామని ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు.
మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సొత్తు అని ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్టు పనులు చూసేందుకు వెళ్లిన తమ నాయకులను పోలీసులు అడ్డుకోవటమేమిటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 లో తమ సర్కార్ అధికారంలోకి వస్తుంది... అపుడు టీఆర్ఎస్ అంతు చూస్తామని హెచ్చరించారు. మెట్రోరైలు పనులు చూడ్డానికి పోలీసులకు అభ్యంతరం ఏమిటన్నారు. రూ.14 వేల కోట్లతో ప్రారంభమైన పనులు సీఎం కేసీఆర్ వైఖరితోనే ఆలస్యమయ్యాయన్నారు.

మూడేళ్లుగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఇందుకు కేసీఆర్, కేటీఆర్ లే కారణమని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు అలైన్మెంట్ మార్చాలనే కేసీఆర్ మొండిపట్టుదలతో ప్రజలపై మూడున్నర వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications