Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెట్రో రైలు ఆలస్యానికి సీఎం కారణం, టిఆర్ఎస్ అంతు చూస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్ళిన తమ పార్టీ నేతలను అడ్డుకోవడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు.2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ అంతు చూస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సొత్తు అని ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్టు పనులు చూసేందుకు వెళ్లిన తమ నాయకులను పోలీసులు అడ్డుకోవటమేమిటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 లో తమ సర్కార్ అధికారంలోకి వస్తుంది... అపుడు టీఆర్‌ఎస్‌ అంతు చూస్తామని హెచ్చరించారు. మెట్రోరైలు పనులు చూడ్డానికి పోలీసులకు అభ్యంతరం ఏమిటన్నారు. రూ.14 వేల కోట్లతో ప్రారంభమైన పనులు సీఎం కేసీఆర్ వైఖరితోనే ఆలస్యమయ్యాయన్నారు.

What is the reason to stop congress leaders metro rail project works asks Uttam kumar reddy

మూడేళ్లుగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఇందుకు కేసీఆర్‌, కేటీఆర్ లే కారణమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలనే కేసీఆర్ మొండిపట్టుదలతో ప్రజలపై మూడున్నర వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+