డబ్బంతా మద్యానికే తగిలేస్తావా?: భర్త మర్మంగాన్ని కోసేసింది
కరీంనగర్: అతను కొట్టినా, తిట్టినా భరించింది. మారకపోతాడా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. చివరికి మద్యానికి బానిసైన తన భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరిద్దరూ రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్తతో రోజు గొడవ జరిగేది. కాగా, కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు.
ఇంటికి వచ్చిన రవీందర్ను కూలీ డబ్బుల గురించి భార్య ఆరా తీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉన్న డబ్బులన్నీ తాగుడుకే తగిలేస్తావా? అంటూ ఆగ్రహానికి గురైన స్వరూప.. కూరగాయలు కోసే కత్తితో భర్త మర్మాంగాన్ని కోసివేసింది. గమనించిన స్థానికులు అతడిని జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications