బీ కేర్పుల్: olxలో యాడ్, కారు కొందామంటే ఇలా జరిగిందేంటబ్బా..!
హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసిన సైబర్ కేటుగాళ్లను మనం చూశాం. సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉన్న ఏ వెబ్సైట్ను వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓఎల్ఎక్స్లోకి చొరబడ్డారు. పెళ్లిరోజు కానుకగా భర్తకు ఆశ్చర్యానికి గురి చేసేలా ఓ బహుమతి ఇవ్వాలనుకుంది.
అయితే అందుకు ఓఎల్ఎక్స్ నుంచి ఖరీదైన బహుమతిని కొందామనుకొని ప్రయత్నించి సైబర్ కేటుగాళ్లు చేతిలో ఓ మహిళ బోల్తాపడిన సంఘటన ఇది. చివరకు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయానని తెలుసుకుని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్కు చెందిన ఒక మహిళ తన భర్తకు షిప్టు డిజైర్ కారును పెళ్లి రోజుకానుకగా ఇవ్వాలనుకుంది. అందుకు ఓఎల్ఎక్స్లో లేటెస్ట్ మోడల్స్ ఏమైనా అమ్మకానికి ఉన్నాయా? అని పరిశీలించింది. అందులో మంచి కారుని రూ 4.5 లక్షలకు అమ్ముతామని తెలిపే ప్రకటనను చూసింది.
వెంటనే అందులో ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసింది. తాను అత్యవసర పనిమీద శంషాబాద్ ఎయిర్పోర్టులో కారును పార్కు చేసి లండన్ వెళ్తున్నానని, కారును విక్రయించే విషయమంతా మా పీఏ చూసుకుంటారంటూ చెప్పి అవతలి వ్యక్తి ఒక ఫోన్నంబర్ ఇచ్చాడు.

దీంతో ఆ మహిళ ఆ నంబర్కు ఫోన్ చేయడంతో ఒక యువతి కారు వివరాలు తెలిపింది. మా సార్తో కూడా మాట్లాడొచ్చంటూ మరో ఫోన్ నంబర్ ఇచ్చింది. దానికి ఫోన్ చేయడంతో ఇంగ్లీష్లో మాట్లాడిన సదరు వ్యక్తి ఇప్పుడే మొత్తం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు, మీరు సగం డబ్బులు ఇచ్చయినా కారు తీసుకోవచ్చంటూ సూచించాడు.
ఇదంతా నిజమేనని నమ్మిన ఆ మహిళ వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసింది. డబ్బులు డిపాజిట్ చేశానంటూ ఫోన్ చేసిన సదరు మహిళకు మీ పని అయిపోతుంది, కారు మీ చేతికి వచ్చినట్లేనని చెప్పి అవతలి యువతి ఫోన్ పెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఆ యువతి ఫోన్ స్విచ్ అఫ్లోనే ఉంది.
దీంతో భర్తకు తెలియకుండా, గిప్టు ఇద్దామనుకొని మోసపోయిన సదరు మహిళ విషయాన్ని గ్రహించి, జరిగిన విషయాన్ని భర్తకు చెప్పి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications