హైకోర్టులో వాట్సాప్ తలాక్ కు వ్యతిరేకంగా పిటిషన్
అక్రమ పద్దతుల్లో చెప్పే ట్రిపుల్ తలాక్ బారి నుండి ముస్లిం మహిళకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం
హైదరాబాద్:అక్రమ పద్దతుల్లో చెప్పే ట్రిపుల్ తలాక్ బారి నుండి ముస్లిం మహిళకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైద్రాబాద్ పాతబస్తీ అలీ జా కోట్ల కు చెందిన తోడికోడళ్ళు మోహరిన్ నూర్ , సైదా హిన ఫాతిమాలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అమెరికాలో ఉంటున్న తమ భర్తలు వాట్సాప్ మేసేజ్ ద్వారా పంపిన ట్రిపుల్ తలాక్ కు చట్టబద్దత లేదని దాన్ని పరిగణనలోకి తీసుకొని విడాకుల పత్రం జారీ చేయకుండా తెలంగాణ వక్ఫ్ బోర్డు ఖాజీలను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
ఇంటి నుండి అత్తమామలలు తమను ఖాళీ చేయించకుండా ఉండేలా పోలీసు భద్రతను కల్పించాలని అభ్యర్థఇంచారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వర్ రావు సోమవారం నాడు విచారణ జరపనున్నారు.
సోదరులైన ఒస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ హఫీజ్ లు తమను వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని మోహరిన్ నూర్ ఫాతిమాలు పేర్కొన్నారు.