వైద్యుల నిర్లక్ష్యం: పంటి నొప్పితో వెళితే.. ప్రాణం తీశారు!
హైదరాబాద్: పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ దంత వైద్యశాలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 37లో ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్లోకి లక్ష్మీ నారాయణ (28) అనే యువకుడు పంటి సమస్యతో దంత చికిత్స కోసం వెళ్లాడు. అయితే, కాసేపటికి పరిస్థితి విషమంగా మారడంతో ఆ యువకుడ్ని దగ్గరల్లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడు మృతి చెందాడని తెలిపారు.

కాగా, లక్ష్మీ నారాయణ మృతిపై అతని కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంటి వైద్యం కోసం వచ్చిన లక్ష్మీ నారాయణకు డాక్టర్లు మత్తు మందు ఎక్కువగా ఇచ్చారని ఆరోపించారు. అనంతరం యువకడు స్పృహ కోల్పోయాడని, దీంతో ఆ యువకుడ్ని వెంటనే అపోలో ఆస్పత్రి నుంచి అపోలోకి తరలించారని చెప్పారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మార్గమధ్యలోనే లక్ష్మీనారాయణ చనిపోయినట్లు నిర్ధారించారని తెలిపారు.
పంటి నొప్పితో వచ్చిన లక్ష్మీనారాయణ.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనస్తేషియా(Anesthesia) డోస్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణానికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు ఎలా చనిపోయాడు? డాక్టర్ల నిర్లక్ష్యమా? అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications