ఫామ్ హౌస్ పార్టీలో విషాదం: యువకుడు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగర శివారులో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్డే పార్టీకని వెళ్లిన వంశీకృష్ణ అనే యువకుడు శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలోని చెంగిచెర్ల పరిధిలోని మ్యారీగోల్డ్ ఫామ్ హౌస్ లోని సోమవారం రాత్రి ఓ యువకుడి బర్త్ డే పార్టీ వేడుకగా జరిగింది.
ఈ బర్త్ డే పార్టీలో వంశీకృష్ణ అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అయికే పార్టీలో ఏం జరిగిందో తెలియదు కానీ, అతడు ఫామ్ హౌస్లోని స్విమ్మింగ్ పూల్లో శవమై తేలాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వంశీకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు బర్త్ డే పార్టీకి వచ్చిన 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ముందుగా ఫామ్ హౌస్లో అనుమతి లేకుండానే బర్త్ డే పార్టీని నిర్వహించారని కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications