కెసిఆర్ మోజు వల్లనే వరంగల్ ఎన్నిక: వర్షంలోనే జగన్ ప్రసంగం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మోజు పడ్డారని, అందుకే వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొర్రూరు ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక రావడానికి కెసిఆర్ కారణమని ఆయన అననారు. దళిత శాసనసభ్యులు ఇద్దరు ఉన్నా కూడా పార్లమెంటు సభ్యుడితో రాజీనామా చేయించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగారు.

ప్రతి పేదవాడి గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. వర్షం పడుతున్నా వైయస్ జగన్ తన ప్రసంగాన్ని సాగించారు. అంతకు ముందు ఆయన రోడ్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జనగామ మీదుగా ఆయన పాలకుర్తి చేరుకున్నారు.
దుద్దేపల్లి, కొండాపురం, ఒగులాపురం, జఫర్ గఢ్, దమ్మన్నపేట, నందనంల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. వర్దన్నపేట సమీపంలోని పోలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, మంచి రోజులు వస్తాయని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications