Tirumala: గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..
కలియువైకుంఠం తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం సాయంత్రం శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై మాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల చుట్టూ ఉన్న 221 గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. పురాణాల ప్రకారం మహావిష్ణువు (శ్రీ వేంకటేశ్వర) గరుడ ఇష్టమైన రథసారధిగా ఉన్నాడు. గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదమని నమ్ముతుంటారు. దర్శనం చేసుకుంటే భక్తులందరి కోరికలను తీరుస్తుందని బలంగా నమ్ముతారు.
ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను కూడా నలుమూలల్లో క్యూలు కట్టి దర్శనానికి అనుమతించారు. గరుడ వాహన సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో ఉదయం స్వామి వారు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడని... గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులని నమ్ముతారు. 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పుష్పకవిమానంపై విహస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications