బీచ్లో పాడుపడి.. చిక్కిన 8 జంటలు.. ఎక్కడ అంటే
బీచ్ అంటేనే.. కేరింత, ఉల్లాసం, ఉత్సాహం కలగలిపి ఉంటాయి. అక్కడ చిన్న, చిరు వ్యాపారులకు ఉపాధి కూడా లభిస్తోంది. అయితే కొన్నిచోట్ల బీచ్ పేరుతో కూడా వ్యభిచారం జరుగుతుంది. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. మచిలీపట్నంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి.. తమ రాసలీలలు సాగిస్తున్నారు.
మంగినపూడి బీచ్లో స్థానికంగా ఉన్న రిసార్ట్లు యూజ్ అవుతున్నాయి. యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు కొనసాగించే వారికి, వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్లకు చేరుతున్నారు. బందరు రూరల్ పోలీసులు రిసార్ట్పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కారు. రిసార్ట్ నడిపే వ్యక్తి మచిలీపట్నంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గదులను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సంపాదనే ధ్యేయంగా వారు తమ కార్యకలాపాలను యదేచ్చగా కొనసాగిస్తున్నారు.
ఆ గదుల్లో గంటకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. రిసార్ట్లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్రూమ్లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. వారిని కూడా చివరికీ పట్టుకున్నారు. ఇలా ఎనిమిది జంటలు చిక్కారని పోలీసులు తెలియజేశారు.
రూమ్లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి మంగినపూడి బీచ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.