ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 48 గంటలపాటు చర్చ...దిశతోపాటు కీలక బిల్లులు పాస్
ఏపీలో శీతాకాల సమావేశాలు మంగళవారం ముగియడంతో అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తూ... స్పీకర్ ప్రకటించారు. కాగా అసెంబ్లీ మొత్తం ఏడు రోజుల్లో మొత్తం 22 బిల్లులను అసెంబ్లీ అమోదించింది. మొత్తం ఏడు రోజుల్లో నలబై ఎనిమిది గంటలపాటు మొత్తం సభ్యులు మాట్లాడగా ...పలు అంశాలపై 64 స్టార్ గుర్తు గల ప్రశ్నలు చర్చకు వచ్చాయి. కాగా అయిదు షార్ట్ నోటీసులకు సమాధానం లభించింది.
ముఖ్యంగా దిశ బిల్లుతోపాటు పలు ఇతర కీలక బిల్లును సభ అమోదించింది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టే బిల్లును సభ అమోదించింది. దీంతో పాటు ఎస్సీ కార్పోరేషన్ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసింది. ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం బిల్లులతో పాటు కాగా చివరి రోజు రాజధానిపై చర్చరిగింది. ఇక సభ మొత్తంలో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ సభ్యులను సభకు వచ్చే సమయంలో అడ్డుకోవడం వివాదంగా మారగా చివరి రోజు టీడీపీ ఎమ్మెల్యేలను చివరి గంటలో సస్పెండ్ చేశారు.. అనంతరం రాజధానిపై జగన్ ప్రకటన అనంతరం మంత్రి కాసేపు అదే అంశంపై మాట్లాడారు. అనంంతరం నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రటించారు.