దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు: మూడు లక్షలమందికి పైగా!
విజయవాడ: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత విశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారి గుడికి రావడం ఇదే తొలిసారి కావడంతో ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వారికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
నవరాత్రుల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మను దర్శించడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్లపై గవర్నర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, దసరా ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఇప్పటిదాకా మూడు లక్షల మందికి పైగా భక్తులు దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించినట్లు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు.

అమ్మవారి మూలా నక్షత్రం రోజున రాత్రి ఒంటి గంట నుంచే గర్భాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరుస్తామని అన్నారు. విజయదశమి నాడు తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాజ రాజేశ్వరిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెప్పోత్సవాన్ని చేపడతారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications