విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాదినేని యామినికి బీజేపీలో కీలక పదవి .. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియామకం

|
Google Oneindia TeluguNews

టిడిపి నుండి బిజెపిలో చేరిన సాదినేని యామిని శర్మకు బీజేపీ కీలక పదవిని కట్టబెట్టింది. భారతీయ జనతా పార్టీలో సాదినేని యామిని శర్మ కు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూ నియామక పత్రం విడుదలైంది . మహిళా మోర్చా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మల కిషోర్ పేరుతో నియామక పత్రం విడుదల కావడంతో బిజెపిలో సాదినేని యామిని శర్మ మరింత తన వాయిస్ ను వినిపించే అవకాశం లభించింది.

ఎలుకలు విగ్రహం పడగొట్టాయంటే అవి కచ్చితంగా మతం మారి ఉంటాయి : సాదినేని యామిని చురకలు ఎలుకలు విగ్రహం పడగొట్టాయంటే అవి కచ్చితంగా మతం మారి ఉంటాయి : సాదినేని యామిని చురకలు

గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన సాదినేని యామిని శర్మ

గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన సాదినేని యామిని శర్మ

టిడిపి లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న యామిని తెలుగుదేశం పార్టీ కోసం అప్పట్లో కీలకంగా పని చేశారు. నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ని టార్గెట్ చేసి ఓ రేంజ్లో రెచ్చిపోయారు. గత ఎన్నికల్లో సాధినేని యామిని కి ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతే కాదు పలు విమర్శలు ఎదుర్కొన్నారు . టీవీ డిబేట్ లలోనూ , ప్రెస్ మీట్ లు పెట్టి సాధినేని యామిని శర్మ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నాడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.

 బీజేపీలో కీలక బాధ్యత .. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా స్థానం

బీజేపీలో కీలక బాధ్యత .. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా స్థానం

గతంలో టిడిపి లోనూ సాధినేని యామిని శర్మ అధికార ప్రతినిధిగా కీలకంగానే వ్యవహరించారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో సైలెంట్ అయిన సాదినేని యామిని శర్మ బిజెపి బాటపట్టారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రస్తుతం ఆమెకు కీలకంగా వ్యవహరించడానికి మహిళా మోర్చా రాష్ట్ర విభాగం కార్యదర్శిగా అవకాశం కల్పించారు.

ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్న, దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ప్రభుత్వం పై తన నిరసన గళాన్ని వినిపిస్తున్న సాధినేని యామిని శర్మకు బిజెపి కీలక బాధ్యతను అప్పగించింది .

 బీజేపీలో ఇప్పటికే వాయిస్ వినిపిస్తున్న యామిని .. కీలక బాధ్యతతో మరింత బలంగా వాయిస్

బీజేపీలో ఇప్పటికే వాయిస్ వినిపిస్తున్న యామిని .. కీలక బాధ్యతతో మరింత బలంగా వాయిస్

రాష్ట్రంలోని ప్రజల సమస్యల కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిళల సమస్యల పరిష్కారం కోసం, సామాజిక సమస్యల కోసం పనిచేస్తానని, సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఎల్లవేళలా పని చేస్తానని సాదినేని యామిని శర్మ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరిన సంవత్సరం తర్వాత సాదినేని యామిని శర్మకు క్రియాశీలక పదవిని కట్టబెట్టడంతో ఆమె తన వాయిస్ ను మరింత బలంగా వినిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.

English summary
The BJP has gave a key post to Sadineni Yamini Sharma, who joined the BJP from the TDP. Sadineni Yamini Sharma has been appointed as the state secretary of Mahila Morcha in the Bharatiya Janata Party. With the release of the appointment letter of Mahila Morcha state unit president Nirmala Kishore, Sadineni Yamini Sharma in the BJP has a chance to make her voice heard more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X