ఆన్లైన్ రమ్మీ నిషేధం బీజేపీ సాధించిన విజయం అంటూనే జగన్ కు సోము వీర్రాజు మరో సూచన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. నిన్న ఏపీ అసెంబ్లీ భేటీలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి గ్యాంబ్లింగ్ పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ప్రభుత్వం నిషేధించడం బీజేపీ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు.
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతుందని, ప్రజల ఆలోచనా ధోరణిలో దారుణమైన మార్పులు వస్తున్నాయని తాను మే 2020లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకు వచ్చాను అని గుర్తుచేశారు. అంతేకాదు బిజెపి నేతలు ఆన్ లైన్ రమ్మీ నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇక దీనితోనే ప్రస్తుతం ఆన్ లైన్ రమ్మీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.ఈ రోజు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం ఏపీ బీజేపీ సాధించిన విజయంగా సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు .

గతంలో రాసిన లేఖలో గుట్కా నిషేధం పై కూడా ప్రస్తావించానని, అప్పటికే ప్రభుత్వం గుట్కాను నిషేధించినప్పటికీ కిరాణా షాపులలో , పాన్ షాప్స్ లో గుట్కా ఇంకా విక్రయిస్తున్నారని, గుట్కా అమ్మకాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏపీలో గుట్కా అమ్మకాలపై కూడా దృష్టిసారించి, వాటిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో బిజెపి చేస్తున్న డిమాండ్లపై, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications