కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!
అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా లేకుండా అదృశ్యమయ్యారు. ఆయన కోసం ఇప్పటికీ కొందరు ఆరా తీస్తుండటం విశేషం. లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడా ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు జరిగిన మే 23వ తేదీ నుంచి ఆయన కన్పించడం మానేశారు.
మే 22వ తేదీన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరగడం మానేశారు. లగడపాటి రాజగోపాల్ ఏది చేసినా సంచలనమే. మొదట తెలంగాణ రాష్ట్రంలో జిరిగిన ఎన్నికల్లో ముందుస్తు సర్వే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుస్తుందని లెక్కలు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రసమితి ఆ ఎన్నికల్లో గెలిచింది. అయితే తన లెక్కలు తప్పు కావడానికి అనేక కారణాలున్నాయని, అవి మే 23వ తేదీ తర్వాత బయటపెడతానని చెప్పుకొచ్చారు.

అనేక చోట్ల ఓట్లు తొలగించడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమిపాలయిందని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయి కారణాలను మే 23వ తేదీ తర్వాత చెబుతానని తెలిపారు.ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చే సరికి లగడపాటి రాజగోపాల్ మరోసారి ప్రత్యక్ష మయ్యారు. మే 21వ తేదీన ఆయన అమరావతిలోనే మీడియా సమావేశం పెట్టి తెలంగాణలో కారు, ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ ఎక్కేందుకు ప్రజలు ఇష్టపడ్డారని పరోక్షంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు.
మే 22వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ టీడీపీ అత్యధికంగా వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ శాసనసభలోకి అడుగుపెడతారని తెలిపారు. అయితే తీరా ఫలితాలు చూస్తే పూర్తిగా రివర్స్ లో రావడంతో లగడపాటి రాజగోపాల్ అక్కడి నుంచి జంప్ అయ్యారు. ముఖ్యంగా లగడపాటి మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బెట్టింగ్ లు పెట్టారు. ఇళ్లు, విలువైన పొలాలను కూడా కొందరు కోల్పోయారు.
ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ పై ఏపీలో కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. అయితే ఆయన ఢిల్లీలోనే ఉండి తన వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications