ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ కు హైపవర్ కమిటీ నివేదిక
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. విశాఖలోని ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ సభ్యులుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నివేదికను అందజేశారు.
Recommended Video
గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన హైపవర్ కమిటీ బాధిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను, గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను, అటు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య వివరణను ,సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన అభిప్రాయాలను నమోదు చేసింది. అంతేకాదు ప్రమాదం జరిగిన తీరును, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను హైపవర్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

గ్యాస్ లీక్ ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత ఐదు గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకున్న కమిటీ, వివిధ రాజకీయ పార్టీ నేతల అభిప్రాయాలను, అధికారుల, జర్నలిస్టుల అభిప్రాయాన్ని సైతం తీసుకుని సమగ్ర నివేదికను తయారుచేసింది. ఈ నివేదికను సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్, కమిటీ సభ్యుడు కరికాల వలవన్.. సీఎంకు అందజేశారు. ఇదే సమయంలో హైపవర్ కమిటీ నివేదికకు సంబంధించి వైజాగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ చంద్, అలాగే వైజాగ్ నగర కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.
మే 7న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీల నివేదికల ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు హైపవర్ కమిటీ నివేదిక సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరిన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ పై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications