విశాఖ యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతం: బెంగళూరులో తేలిన అక్కాచెల్లెళ్లు..
మూడురోజుల క్రితం విశాఖపట్టణంలో కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్ల ఆచూకీ దొరికింది. విశాఖలో మాయమై.. బెంగళూరులో తేలారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లి.. అటు నుంచి బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మొబైల్ లోకేషన్ ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి వైజాగ్ తీసుకొస్తున్నారు.
ఈ నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు తమ గురించి వెతకొద్దని తల్లికి మేసెజ్ చేశారు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. వెంటనే ద్వారకా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి.. అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు మొబైల్ లోకేషన్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పేరెంట్స్కు సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు ఎందుకు పారిపోయారనే అంశంపై క్లారిటీ లేదు. ఈ అంశంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

అక్కాచెల్లెళ్లు ఎందుకు వెళ్లిపోయారే తెలియకున్నా.. వారు క్షేమంగా ఉన్నారని తెలిసి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య మనసు కాస్త స్థిమిత పడిందని చెప్తున్నారు. తమ కూతుళ్ల ఆచూకీ కనుకొని అప్పగిస్తోన్న పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారు చేసిన మేలును జన్మలో కూడా మరచిపోలేదని చెప్పారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications