విశాఖ ఉక్కు ఉద్యమం .. అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ , ఆందోళన ఉధృతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ ఉక్కు ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. అఖిలపక్ష పార్టీల సహకారంతో కార్మిక పోరాటం ఉధృతమవుతోంది.
Recommended Video


విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అఖిలపక్ష నాయకులు, కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యమం కారణంగా ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదే ఉద్యమస్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మికులు పేర్కొన్నారు.

కార్మిక పోరాటానికి మద్దతుగా అన్ని పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలలో ఉందని విస్తరణ కారణంగానే రుణాలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్న నాయకులు ప్రస్తుతం నష్టాల్లో ఉండడానికి తాము కారణం కాదని తేల్చి చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల లక్షకు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడిన కార్మికులు జీవనోపాధి కోల్పోతారని , వారి బ్రతుకులు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల ఆందోళనలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదన్న అఖిలపక్ష నేతలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అఖిలపక్ష నేతలు తేల్చి చెబుతున్నారు . విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొనసాగుతున్న కార్మికుల ఆందోళనలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు వైసిపి ఎంపీలు ఎం వివి సత్యనారాయణ , బి సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి తోపాటు పలువురు పాల్గొని కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు.
కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు .
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications