చంద్రబాబుకు నోటీసులపై అచ్చెన్నాయుడు ఫైర్- మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులా ?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అసైన్డ్ భూముల్ని రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసం వాడామని, దీనిపై కేసులు పెట్టడమేంటన్నారు. అసలు దేశ చరిత్రలో ఓ మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర ఉందా అని అచ్చెన్న ప్రశ్నించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీయే ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగితే ఆరేళ్ల తర్వాత ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్షసాధింపే అన్నారు.

జగన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని, అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర ఆయనదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇళ్ల స్ధలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములు లాక్కొన్నారని, దశాబ్దాల తరబడి ఇడుపుల పాయలో అసైన్డ్ భూములు వాడుకున్న చరిత్ర జగన్ది అని అచ్చెన్న విమర్శించారు. వాన్పిక్ భూములు లాక్కొని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. తాము రాజధాని నిర్మాణం కోసం అసైన్డ్ భూములు తీసుకున్నామని, జగన్ సోలార్ కంపెనీల కోసం అసైన్డ్ భూములు లాక్కోలేదా అని అచ్చెన్న ప్రశ్నించారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!












Click it and Unblock the Notifications