కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?
వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు కేసీఆర్. అవసరమైతే కలప స్మగర్లపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు.
కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో కలప స్మగ్లర్ల డొంక కదులుతోంది. ఆ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
పలిమెల మండలంలోని సర్వాయిపేట అడవుల్లో అక్రమ కలప నిల్వలను గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసుల సాయం తీసుకుని ఆ స్థావరంపై అటాక్ చేశారు. దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే 56 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కర్రను కోసే యంత్రాలు కూడా సీజ్ చేశారు. అనంతరం మహదేవపూర్ డిపోకు తరలించారు.

అడవులను సంరక్షించాలనే ఉద్దేశంతో, పూచిక పుల్ల కూడా బయటకు పోవద్దనే కేసీఆర్ సూచనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కలప స్థావరాలపై దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లాలో ఆకస్మిక దాడులు చేసినట్లు సమాచారం.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications