వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బే ఏరియా తెలుగుసంఘం సునామీ విరాళ కార్యక్రమం

By Staff
|
Google Oneindia TeluguNews

శనివారం జులై 22వ తేదీన లెమాంట్‌ నగరంలోని హిందూ దేవాలయంలో గ్రేటర్‌ చికాగో తెలుగు సంఘాలు టిఎజిసి, టిటిఎ, చికాగో సాహితీ మిత్రులు సంయుక్తంగా నిర్వహించిన పద్మభూషణ్‌ రాజా రాధారెడ్డిల కూచిపూడి నృత్యం అత్యంత మనోహరంగా సాగింది. కూచిపూడి నాట్యంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన రాజారెడ్డి, రాధారెడ్డి బృందం నాట్యప్రదీపం అనే శీర్షికన ప్రదర్శించిన హరిహర నాట్య విన్యాసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

తన 40 ఏళ్ల నాట్యానుభవాన్ని రంగరించి రాజారెడ్డి, రాధారెడ్డి భాగవతంలోని గీతోపదేశాన్ని కనులవిందుగా ప్రదర్శించారు. రాజారెడ్డి కూతురు యువ నాట్యతార యామిని రెడ్డి కైలాసవాసుని నృత్యం అద్భుతంగా ప్రదర్శించింది. అలాగే కౌసల్యారెడ్డి నృత్యం ప్రేక్షకుల మన్ననలను పొందింది. తెలుగు సంస్థల తరఫున శారద మెట్టుపల్లి ఆహ్వానితులకు, కార్యక్రమ నిర్వాహకులైన డాక్టర్‌ విశ్వనాథ రెడ్డికి, లక్షికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రసన్నారెడ్డి, నీలిమారెడ్డి సభా నిర్వహాకులుగా వ్యవహరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X