వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూనివర్సిటీ కోసం పాలమూరు ఎన్నారైల ఔదార్యం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
న్యూజెర్సీ: అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 'పాలమూరు విశ్వవిద్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆవర్శిటీ ఉప కులపతి (వైస్ చాన్స్ లర్) ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో అమెరికాలో స్థిరపడిన పాలమూరు ఎన్నారైలు మరింత చురుగ్గా ముందుకు కదలాలని ఆయన పేర్కొన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులను సేకరించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రొఫెసర్ రెడ్డి న్యూజెర్సీ వచ్చిన పాలమూరు ఎన్నారై ఫోరం (పిఎన్నారై ఫోరం) సోమర్ సెట్ లో ఘనంగా సన్మానించింది. ఈ సన్మానసభకు హాజరైన పారమూరు ఎన్నారై ఫోరం సభ్యులను, అమెరికా పర్యటనకు వచ్చిన వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు.

పాలమూరు విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ పట్టణంలో ఇటీవలే 187 ఎకరాల భూమిని కేటాయించింది. సంవత్సరం క్రితమే ప్రొఫెసర్ రెడ్డిని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా నియమించింది. అప్పటి నుంచి వర్శిటీ అభివృద్ధి కోసం ప్రొఫెసర్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X