వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొలంబస్ బాబా గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలు
సుమారు 900 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు విందు భోజనాలను ఏర్పాటు చేశారు. మే 27న నిర్వహించే శాశ్వత షిర్డీ సాయిబాబా ఆలయ శంఖుస్థాపన, నిర్మాణ కార్యాచరణ ప్రణాళికలను బోర్డు అధ్యక్షుడు యర్రంశెట్టి సత్య ప్రకటించారు. సుమారు 16,500 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్న ఈ మందిరం అమెరికాలో అతిపెద్ద భారతీయ మందిరంగా నిలుస్తుందని ఆలయ కమిటీ తెలిపింది. షిర్డీ సాయిబాబాతో పాటు హనుమంతుడు, విఘ్నేశ్వరుని విగ్రహాలను కూడా ప్రతిష్ఠంచనున్నట్లు వారు తెలిపారు.
Story first published: Friday, March 26, 2010, 10:12 [IST]