బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమెరికాలో సన్మానం
తెలంగాణ కోసం బిజెపి ఇస్తున్న మద్దతును సైతం ఆయన వివరించారు. చిన్న రాష్ట్రాలతోనే మంచి పరిపాలన సాధ్యమవుతుందన్న గట్టి అభిప్రాయంతో తెలంగాణకు బిజెపి మద్దతు ఇస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే కాంపిటీషన్ కారణంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రస్తుత సంక్షోభానికి తెరతీయాలని ఆయన సూచించారు. 2013లో యోగి, స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎన్నారైలు అందరూ ముందుకు రావాలని కోరారు. ప్రపంచంలో భారత్ను లీడర్గా నిలబెట్టడంలో ఎన్నారైలు ప్రముఖ పాత్ర వహించాలని సూచించారు. కాగా శ్రీరామ్ వెదిరె, వేమూరి సుబ్రహ్మణ్యం తదితరులు భారతదేశంలోని కొన్ని అంశాలపై బిజెపికి సలహాలు ఇచ్చారు. ఢిల్లీకి చెందిన బిజెపి నాయకుడు విజయ్ జోలీ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అమెరికా నేతల దృష్టి భారతదేశం వైపు పడేలా ఎన్నారైలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు కిషన్ రెడ్డిని మెమొంటో, శాలువాతో సత్కరించారు.