వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిపై పోరు: ఎన్నారైలతో కిరణ్ బేడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Bedi
అవినీతి వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని డాక్టర్ కిరణ్ బేడీ ఎన్నారైలను కోరారు. పీపుల్ ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ పిలుపునిచ్చారు. అవినీతిని అరికట్టడానికి పని చేస్తున్న శాఖలు సమర్థంగా లేవని, అందుకే లోక్‌పాల్ బిల్లు అవసరమైందని ఆమె అన్నారు. అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ ముందు ప్రదర్సన నిర్వహించాలని ఆమె సూచించారు. నిర్దిష్ట వ్యవధిలో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థలకు, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆమె చెప్పారు.

పిఎఫ్ఎల్ నిర్వహించిన దండి మార్చ్ -2 వంటి కార్యక్రమాల ద్వారా ఎన్నారైలు తమ దేశభక్తిని చాటుకున్నారని ఆమె కొనియాడారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోని ఎన్నారైలు దండి మార్చ్ - 2 వంటి కార్యక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టడం అవసరమని ఆమె అన్నారు. పాలనా సంస్కరణలు, ఎన్నికల సంస్కరణల కోసం పోరాటాలు చేయాలని ఆమె అన్నారు. కిరణ్ బేడీ అర గంట పాటు ప్రసంగించారు. సమావేశానికి వచ్చినవారు వేసిన ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

అమెరికాలో కిల్ కరప్షన్ ఉద్యమాన్ని సమన్వయం చేస్తున్న హైమా సాగి పిఎఫ్ఎల్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరిస్తామని దినేష్ చెప్పారు. కార్యక్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ రణబోతు కిరణ్ బేడీకి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
In a conference call organized by People For Loksatta (PFL)for NRIs, Dr. Kiran Bedi urged all NRIs to come together in fighting against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X