పిఎఫ్ఎల్ తొలి కార్యవర్గ బోర్డు

NRI
జయప్రకాశ్ నాయకత్వంలోని లోకసత్తా పార్టీకి మద్దతు తెలుపుతున్న ఎన్నారై సంస్థ పీపుల్ ఫర్ లోకసత్తా తొలి కార్యవర్గ బోర్డు ఏర్పడింది. ఎన్నికల ద్వారా బోర్డు ఎంపిక జరిగింది. ఎన్నికల కమిషనర్లు శ్రీకాంత్ గోదె, పద్మ భూపతిరాజు ఎన్నికలను నిర్వహించారు. బే ఏరియాకు చెందిన ప్రసన్న మేదా పిఎఫ్ఎల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బల్తిమోర్‌కు చెందిన దిలీప్ శంకర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా (ఆర్థిక విభాగం) ఎన్నికయ్యారు. కిరణ్ ఇందుకూరి మరో ఉపాధ్యక్షుడిగా (సభ్యత్వ విభాగం) గెలిచారు. దండి మార్చ్ 2 కార్యక్రమానికి రూపకల్పన చేసిన జవహర్ కంభంపాటి ప్రాజెక్టుల విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

హైమా సాగి ఈవెంట్ విభాగం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. హౌస్టన్‌కు చెందిన దినేష్ పగడాల మీడియా విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బోర్డుకు యువకులు ఎన్నికయ్యారని, పిఎఫ్ఎల్ వీరి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని పిఎఫ్ఎల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కళ్యామ్ రామన్ అన్నారు. 2014 ఎన్నికల నాటికి జయప్రకాశ్ నేతృత్వంలోని లోకసత్తా పార్టీని బలోపేతం చేస్తామని ప్రసన్న మేధ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+