జయశంకర్తో అనుబంధంపై ఎన్నారైలు

కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా పని చేసినప్పుడు జయశంకర్ విద్యార్థుల సమస్యలను ఎలా పరిష్కరించారో ఆ విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి విష్ణు మాధవరం వివరించారు. జయశంకర్ మృతి తీరని లోటు అని రాజేష్ బాదం అన్నారు. తెలంగాణలోని అత్యంత విద్యావంతుల్లో జయశంకర్ ఒకరని సంతోష్ వేముల అన్నారు. జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ సాధనకు మనమంతా పునరంకితం కావాలని రమణ కంచెట్టి అన్నారు. జయశంకర్ పరిశోధనా పత్రాలు, డాక్యమెంట్లు, ప్రసంగాలను భద్రం చేయడానికి హైదరాబాదులో ఓ ప్రదర్సనశాలను ఏర్పాటు చేయాలని జగదీష్ బొందుగుల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ దొమ్మాట, అనిల్ కేశినేని, రామ్ ఎనగంటి, రవీందర్ గడ్డంపల్లి, వేణు రవ్వా, విజయ్ సేరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications