సాన్వీని చంపాలనుకోలేదు: రఘు
తాను ఎవరినీ చంపాలనుకోలేదని, కనీసం గాయపరచే ఉద్దేశం కూడా లేదని, అయితే తాను తెచ్చిన కత్తితో పెనుగులాటలో సత్యవతి చనిపోయిందని తెలిపాడు. శబ్దం చేయకుండా ఉండేందుకు జేబు రుమాలును సాన్వి నోటికి అడ్డం పెట్టానని, ప్రమాదవశాత్తు చేయి జారి కింద పడిన సాన్వీని అపార్ట్మెంటులోని బేస్మెంటులో ఎవరూ చూడని ప్రాంతంలో పడేశానని వివరించాడు.
ఆ మధ్య అమెరికాలో పది నెలల చిన్నారి సాన్వీని కుటుంబా మిత్రుడు రఘు అనే యువకుడు అపహరించి, హత్య చేశాడు. చాపను కిడ్నాప్ చేసే సమయంలో అడ్డం వచ్సిన నాయనమ్మ సత్యవతిని కొట్టి చంపాడు. అమెరికా ఎఫ్బిఐ దర్యాప్తులో ఈ ఘోరం వెలుగు చూసింది. సాన్వీ హత్యకు గురైన విషయాన్ని శాంటియాగో పోలీసులు ప్రకటించారు.
అక్టోబర్ 22 వ తేదీన పాప తల్లిదండ్రులు తమ తమ పనులపై ఆఫీసులకు వెళ్లిపోయిన అనంతరం రఘు ఇంటికి వచ్చి సాన్వి నాయనమ్మ సత్యవతమ్మను దారుణంగా హతమార్చి పాపను ఎత్తుకుపోయాడు. రఘు నుంచి మొత్తం సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా ప్రాంతంలోని ఒక ఎపార్ట్మెంట్లో శివప్రసాద్ రెడ్డి, లత కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఆ ఇంటిలో నుంచే కిడ్నాప్ జరిగింది.