అమెరికాలో పుచ్చలపల్లి శతజయంతి
పార్టీలకతీతం గా, ప్రాంతాలకతీతంగా తెలుగు వారందరూ గర్వించదగ్గ ప్రజా నాయకుడు సుందరయ్య శతజయంతి (1912 - 2012) సభ ను అమెరికాలో కూడా నిర్వహించి, పక్క దారి పట్టిన వర్తమాన రాజకీయాలలో, దార్శనిక రాజకీయాలకు ఆద్యుడు అయినటువంటి సుందరయ్య ఆలోచనల అవశ్యకతను గుర్తు చెయ్యాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
"ప్రజా రాజకీయాలలో పుచ్చలపల్లి సుందరయ్య - సమకాలీన భారతదేశం, ప్రపంచంలో పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచనలు ఒక పరిశీలన " అన్న అంశంతో నిర్వహిస్తున్న ఈ సభకు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, హేతువాద ఉద్యమ నాయకుడు నరిసెట్టి ఇన్నయ్య ముఖ్య అతిధిగా హాజరవుతారు.
డల్లాస్ సాహితీ మిత్రులు ఉదయ్ భాస్కర్ నందివాడ, చంద్ర కన్నెగంటి, సాజి గోపాల్, కెసి చేకూరి, చంద్రహాస్ మద్దుకూరి, శ్రీమతి శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి గౌరవ అతిధులుగా ప్రసంగించనున్నారు.
గోపినాథ్ పేటేరు, జయ కళ్యాణి, జ్యోతి సాధుల ఆధ్వర్యంలో సుందరయ్య భావాలకు స్ఫూర్తి గా కొన్ని అభ్యుదయ గేయాలాపన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డల్లాస్, పరిసర ప్రాంత తెలుగువారందరూ పాల్గొని, జీవితాతంతం ప్రజలపక్షాన నిలబడిన అసలు సిసలు ప్రజాస్వామ్యవాది పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి అర్పిస్తూ అయన ఆలోచన ల స్పూర్తిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ బాధ్యత నిర్వహిద్దామని నసీమ్ షేక్ పిలుపునిచ్చారు.