30 లక్షల డాలర్లు చీటింగ్: భారతీయులు అరెస్టు
న్యూయార్క్: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, బ్యాంకులను మోసం చేశారని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ఐదుగురితో సహా 7గురిని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు 30 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్షల డాలర్ల అపరాధ రుసుం విధిస్తారని అక్కడి న్యాయనిపుణులు అంటున్నారు.
భారత సంతతికి చెందిన జ్యోస్నా కరణ్ (43), ప్రవీణ్ సింగ్ (53), మహేంద్ర ప్రసాద్ (53) అనే ముగ్గురిని కాలిఫోర్నియా నగరంలో అరెస్టు చేశారు. పాల్ సింగ్ (79), సునితా సింగ్ (60), అమెరికాకు చెందిన స్యానీ ఇష్యాక్ (69), మార్టీన్ బహ్రామ్ (42) అనే ఐదుగురిని న్యూ యార్క్ సమీపంలో అరెస్టు చేశారు.

న్యూయార్క్ పోలీసుల కథనం మేరకు ఈ 7గురు వివిధ స్కీంల కింద పలువురి దగ్గర నగదు వసూలు చేసి వారిని మోసం చేశారు. అదే విధంగా పలు బ్యాంకులలో వీరు నగదు లావాదేవీలు నిర్వహించి మోసం చేశారు.
సుమారు 30 లక్షల డాలర్ల మేరకు బ్యాంకులకు మోసం చేశారని గుర్తించిన పోలీసులు వీరి కోసం గాలించారు. చివరికి అందరిని అరెస్టు చేశారు. నిందితులు నేరం చేసినట్లు వెలుగు చూసిందని, వీరికి కోర్టులో 30 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications