హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలోని పనామాలోని ఓ హోటళ్లోని స్విమ్మింగ్ ఫూల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లాలోని కంబం మండలంలోని రావిపాడుకు చెందిన సిహెచ్ సాయికృష్ణగా గుర్తించారు.

సాయికృష్ణ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికాలోని హూస్టన్ యూనివర్సిటీలో చేరాడు. కాగా, అతని కుటుంబసభ్యులు కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు.

Hyderabad boy found dead in swimming pool in US

మృతుడి అంకుల్, హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. విహార యాత్ర కోసం పనామా వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్కాన్సాలో ఉంటున్న తమ బంధువులు సాయికృష్ణ మృతి విషయాన్ని చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు.

అక్కడి పోలీసులు సాయికృష్ణ మృతదేహాన్ని స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటికి తీసినట్లు తెలిపారని చెప్పారు. అయితే ఘటన ఎలా జరిగిందనే విషయం మాత్రం తమకు తెలియరాలేదని చెప్పారు. కాగా, మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

English summary
A 23-year-old youth from Prakasam district in Andhra Pradesh was found dead in a swimming pool at a hotel in Panama, United States on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X