అమెరికాలో దారుణం.. నలుగురు తెలుగువారి అనుమానాస్పద మృతి
లోవా : అమెరికాలోని అయోవా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వెస్ట్ డి మాయిస్ సిటీలో ఈ ఘటన జరిగింది. మృతులను సుంకర చంద్రశేఖర్, లావణ్యలతో పాటు 15, 10ఏళ్లున్న వారి కుమారులుగా గుర్తించారు. మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
మృతులు నివాసముంటున్న ఇంట్లో మరో కుటుంబం అద్దెకు ఉంటోంది. వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు పంపారు. ఘటనాస్థలంలో పరిస్థితిని బట్టి హత్య అయి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. అయితే ఎవరు ఏ కారణం చేత ఈ దారుణానికి పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు చంద్రశేఖర్ది గుంటూరు జిల్లాగా తెలుస్తోంది. చుండూరులో చదువుకున్న ఆయన ఉన్న విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications