కోట్ల రూపాయల అక్రమ చలామణి కేసులో ముగ్గురు భారతీయ అమెరికన్లు
న్యూయార్క్ : కోట్ల రూపాయల నగదు అక్రమ చలామణీ స్కాంలో దోషులను అమెరికా కోర్టు నిర్ధారించింది. ఈ కుంభకోణంలో మొత్తం ఆరుగురి పాత్ర ఉందని .. వీరిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు అనే కఠోర వాస్తవాన్ని తెలిపింది. ఈ కేసు విచారణ ఐదువారాల పాటు జరిగిందని .. ఎంక్వైరీ క్రమంలో దోషులుగా మొత్తం ఆరుగురు తేలారని పేర్కొన్నది.
దోషులు వీరే ..
అమెరికాలోని టెక్సాస్ లోని లారెడోకి చెందిన గుడిపాటి రవీందర్ రెడ్డి (61), హర్ష్ జగ్జీ (54), నీరు జగ్గి (51) దోషులుగా తేలారని వెల్లడించింది. వీరితోపాటు మరో ముగ్గురు అమెరికా పౌరులపై అభియోగాలు రుజువయ్యాయని న్యాయశాఖ క్రిమినల్ విభాగ సహాయ అటార్నీ జనరల్ బ్రియాన్ జంక్జోస్కీ తెలిపారు.

క్విడ్ ప్రోకో ...
2011 నుంచి 2013 వరకు అమెరికాలో నిందితులు డ్రగ్స్ విక్రయించారని పేర్కొన్నారు. అలా వచ్చిన నగదును టెక్సాస్ లోని లారెడోకు తరలించారని గుర్తుచేశారు. అనంతరం ఆ నగదు గుడిపాటి రవీందర్ రెడ్డి, హర్ష్ జగ్జీ, నీరు జగ్జీలకు చెందిన అత్తరు దుకాణాలకు చెరవేశారు. ఈ మేరకు కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువవడంతో .. ఇక దోషులకు శిక్ష విధించడమే మిగిలి ఉంది.












Click it and Unblock the Notifications