Chigurupati Jayaram: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డి జీవిత ఖైదు విధించిన కోర్టు
చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది..
ప్రవాస భారతీయుడు (NRI) చిగురుపాటి జయరామ్(Chigurupati Jayaram)ను హత్య కేసులో దోషిగా తేలిన రాకేష్రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ముగ్గురు పోలీసులతో సహా మరో 11 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం 23 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం రాకేష్ రెడ్డి(Rakesh Reddy)ని దోషిగా నిర్ధారించింది.
2019 జనవరి 31న జూబ్లీహిల్స్లో జయరామ్ హత్యకు గురయ్యాడు. అయితే నిందితుడు రాకేష్ రెడ్డి విజయవాడలోని నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ వద్ద రహదారిపై కారులో ఉంచాడు. అనుమానించిన పోలీసులు దాన్ని హత్యగా నిర్ధారించారు.

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications