Chigurupati Jayaram: చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో రాకేష్ రెడ్డి జీవిత ఖైదు విధించిన కోర్టు

చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది..

ప్రవాస భారతీయుడు (NRI) చిగురుపాటి జయరామ్‌(Chigurupati Jayaram)ను హత్య కేసులో దోషిగా తేలిన రాకేష్‌రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ముగ్గురు పోలీసులతో సహా మరో 11 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం 23 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం రాకేష్ రెడ్డి(Rakesh Reddy)ని దోషిగా నిర్ధారించింది.

2019 జనవరి 31న జూబ్లీహిల్స్‌లో జయరామ్ హత్యకు గురయ్యాడు. అయితే నిందితుడు రాకేష్ రెడ్డి విజయవాడలోని నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ వద్ద రహదారిపై కారులో ఉంచాడు. అనుమానించిన పోలీసులు దాన్ని హత్యగా నిర్ధారించారు.

Nampally Court Life Imprisonment Imposed on Chigurupati Jayaram Murder Case Covicted Rakesh Reddy
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో రాకేష్‌రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యానంతరం, రాకేష్ రెడ్డి సహాయ పోలీసు కమిషనర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా ఇతర నిందితుల సహాయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో విచారణ అనంతరం 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+