మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లండన్లో ఘన స్వాగతం (ఫోటోలు)
లండన్: బ్రిటన్ ప్రభుత్వం లండన్లో నిర్వహిస్తున్న 'Education World Forum 2015" సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి లండన్ లోని ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి సెల్, తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రతినిథులు ఘన స్వాగతం పలికారు.
జై తెలంగాణా నినాదాలతో లండన్ హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయం మారుమోగింది. ఈ సదస్సులో 80 పైగా దేశాల ప్రతినిథులు పాల్గొంటారు. ఈ సదస్సు ముగిసిన తరువాత మంత్రి గారితో బంగారు తెలంగాణా, మిషన్ కాకతీయ పై ఒక కార్యక్రమం నిర్వించేందుకు నిర్ణయించామని ఎన్నారై టీఆర్ఎస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి సెల్ అనిల్ కూర్మాచలం తో పాటు ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ అక్రం షాషా, అధికార ప్రతినిథి శ్రీకాంత్ జెల్ల, శ్రీనివాస్, గోపి పాల్గొన్నారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ అంతటి, సెక్రెటరీ రంగుల సుధాకర్ గౌడ్, అలాగే జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాదక్షులు ప్రవీణ్ పాల్గొన్న వారిలో ఉన్నారు.