పట్టిసీమ చారిత్రాత్మకం: ఎన్నారై టిడిపి(పిక్చర్స్)
న్యూయార్క్: పట్టిసీమ ప్రాజెక్టు చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు పేర్కొన్నారు.అమెరికా బే ఏరియాలోని మిల్ పిటాస్లో తెలుగుదేశం పార్టీ ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పట్టిసీమ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎన్నారై నేత జయరాం కోమటి మాట్లాడుతూ.. గోదావరి నీటిని కృష్ణా నదిలో కలపడానికి పట్టిసీమ ప్రాజెక్టు ఒక మహా యజ్జంలా చేపట్టి చంద్రబాబు రికార్డు సృష్టించారని అన్నారు. దీంతో నదుల అనుసంధానంలో భారతదేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చడానికి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం ఎనలేని కృషి చేశారన్నారు. ఎన్నారై తెలుగుదేశం విభాగం కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో టిడిపి మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్, వెంకట్ కోగంటి, వీరు ఉప్పుల, యశ్వంత్ కుదరవల్లి, విజయ్ అసూరి, వల్లూరిపల్లి శ్రీను, సతీష్ వేమూరి, కృష్ణమోహన్, దిలీప్ కుమార్, హేమరావు నందిపాటి, క్రిస్ యలవర్తి, శ్రీని విరపనేని, రజనీకాంత్ కాకర్ల, భాస్కర్ వల్లభనేని, సురేష్ బబ్బూరి, రామ్ తోట, ప్రదీప్, వినయ్ పరుచూరి, హను కొత్తపల్లి, నవీన్ కుమార్, ముప్పవరపు వెంకట్, కిరణ్, జితేంద్ర ఆరే తదితరులు పాల్గొన్నారు.
ఎన్నారై టిడిపి
పట్టిసీమ ప్రాజెక్టు చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు పేర్కొన్నారు.
ఎన్నారై టిడిపి
అమెరికా బే ఏరియాలోని మిల్ పిటాస్లో తెలుగుదేశం పార్టీ ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పట్టిసీమ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.
ఎన్నారై టిడిపి
ఈ సందర్భంగా ఎన్నారై నేత జయరాం కోమటి మాట్లాడుతూ.. గోదావరి నీటిని కృష్ణా నదిలో కలపడానికి పట్టిసీమ ప్రాజెక్టు ఒక మహా యజ్జంలా చేపట్టి చంద్రబాబు రికార్డు సృష్టించారని అన్నారు. దీంతో నదుల అనుసంధానంలో భారతదేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
ఎన్నారై టిడిపి
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చడానికి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం ఎనలేని కృషి చేశారన్నారు. ఎన్నారై తెలుగుదేశం విభాగం కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసింది.