హుధుద్: బాబుకు చెక్కు అందించిన కువైట్ ఎన్నారైలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు కళా సమితి(కువైట్) ఉపాధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా హుధుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సిఎం చంద్రబాబుకు రూ. 15.42 లక్షల చెక్కును అందించారు.
తెలుగు కళా సమితి చేస్తున్న ఈ సాయానికి చంద్రబాబునాయుడు వారిని అభినందించారు. జాయింట్ సెక్రటరీ కొర్రపాటి వెంకటేశ్వర్లు, కోశాధికారి అన్నాజీ శేఖర్, కమిటీ సభ్యులు దరూర్ చంద్రశేఖర్, కొండపల్లి నాగేశ్వరరావు, తెలుగు కళా సమితి సభ్యులు శోభశ్రీ ఈ బృదంలో ఉన్నారు. కోశాధికారి అన్నాజి శేఖర్, జాయింట్ సెక్రటరీ వెంటకేశ్వర్లు తెలుగు కళా సమితి చేస్తున్న వివిధ సేవా కార్యక్రమల గురించి చంద్రబాబుకు వివరించారు.
హుధుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కళా సమితి సభ్యులు, వాలంటీర్లు, ప్రవాసులకు సుధాకర్ రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వందకుపైగా సాంస్కృతిక, సేవా కార్యక్రమాల కళా సమితి ఆధ్వర్యంలో చేపట్టామని ఆయన చెప్పారు. కువైట్లో తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు.
కువైట్ ఎన్నారైలు
తెలుగు కళా సమితి(కువైట్) ఉపాధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు.
కువైట్ ఎన్నారైలు
తెలుగు కళా సమితి చేస్తున్న ఈ సాయానికి చంద్రబాబునాయుడు వారిని అభినందించారు.
కువైట్ ఎన్నారైలు
మరో బృందం కూడా చంద్రబాబును కలిసింది. జాయింట్ సెక్రటరీ కొర్రపాటి వెంకటేశ్వర్లు, కోశాధికారి అన్నాజీ శేఖర్, కమిటీ సభ్యులు దరూర్ చంద్రశేఖర్, కొండపల్లి నాగేశ్వరరావు, తెలుగు కళా సమితి సభ్యులు శోభశ్రీ ఈ బృదంలో ఉన్నారు.
కువైట్ ఎన్నారైలు
కోశాధికారి అన్నాజి శేఖర్, జాయింట్ సెక్రటరీ వెంటకేశ్వర్లు తెలుగు కళా సమితి చేస్తున్న వివిధ సేవా కార్యక్రమల గురించి చంద్రబాబుకు వివరించారు.
కువైట్ ఎన్నారైలు
హుధుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కళా సమితి సభ్యులు, వాలంటీర్లు, ప్రవాసులకు సుధాకర్ రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.