దుబాయ్లో ఎన్నారైల వనభోజనాలు: ఆటలు(పిక్చర్స్)
దుబాయ్: దుబాయ్ వాసవి యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో గత శుక్రవారం(అక్టబోర్ 31న) కార్తీకమాస వన భోజనాలను జబీల్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రప్రథమ ఆర్యవైశ్య ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఆయన సతీమణి లత గుప్తా, ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటులు గుండు హనుమంతరావు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి 750మందికి పైగా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. వాసవి యూత్ పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు, బెలూన్ మేకింగ్, మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా పట్టుకుంటే పట్టుచీర వంటి కార్యక్రమాలే కాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం, ప్రత్యేకంగా ఉలవచారు,
బొబ్బట్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఆయన సతీమణి లత గుప్తా, నటుడు గుండు హనుమంత రావులను వాసవి యూత్ ఎన్నారై కార్యవర్గం ఘనంగా సన్మానించింది. దుబాయిలో వివిధ రంగాలలో సేవా కార్యక్రమం నిర్వహిస్తోన్న ఆర్యవైశ్య ప్రముఖులు యలమర్తి శరత్, లాయర్ అనురాధ
బొబ్బిలిశెట్టి, సోని కిరణ్లను బిగల్ గణేష్ గుప్తా సన్మానించారు. గుండు హనుమంతరావు వీరిని అభినందించారు.

వనభోజనాలు
దుబాయ్ వాసవి యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో గత శుక్రవారం(అక్టబోర్ 31న) కార్తీకమాస వన భోజనాలను జబీల్ పార్క్లో ఘనంగా నిర్వహించారు.

వనభోజనాలు
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రప్రథమ ఆర్యవైశ్య ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఆయన సతీమణి లత గుప్తా, ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటులు గుండు హనుమంతరావు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.

వనభోజనాలు
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా వాసవి యూత్ ఎన్నారై పలు సేవలతో ఆర్ధికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్ధులను చదివించడం అభినందనీయమన్నారు.

వనభోజనాలు
ఈ వనభోజన కార్యక్రమానికి 750మందికి పైగా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.

వనభోజనాలు
వాసవి యూత్ పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు, బెలూన్ మేకింగ్, మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా పట్టుకుంటే పట్టుచీర వంటి కార్యక్రమాలే కాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం, ప్రత్యేకంగా ఉలవచారు, బొబ్బట్లు ఏర్పాటు చేశారు.

వనభోజనాలు
వాసవి యూత్ పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు, బెలూన్ మేకింగ్, మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా పట్టుకుంటే పట్టుచీర వంటి కార్యక్రమాలే కాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం, ప్రత్యేకంగా ఉలవచారు, బొబ్బట్లు ఏర్పాటు చేశారు.

వనభోజనాలు
దుబాయిలో వివిధ రంగాలలో సేవా కార్యక్రమం నిర్వహిస్తోన్న ఆర్యవైశ్య ప్రముఖులు యలమర్తి శరత్, లాయర్ అనురాధ బొబ్బిలిశెట్టి, సోని కిరణ్లను బిగల్ గణేష్ గుప్తా సన్మానించారు.

వనభోజనాలు
గణేష్ మాట్లాడుతూ.. వాసవి యూత్ ఎన్నారై పలు సేవలతో ఆర్ధికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్ధులను
చదివించడం అభినందనీయమన్నారు. సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్, జయేష్ కొప్పర్తి, రఘురాం సందీప్ దిగ్గవల్లిని అభినందించారు.

వనభోజనాలు
సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్, జయేష్ కొప్పర్తి, రఘురాం సందీప్ దిగ్గవల్లిని హనుమంతరావు అభినందించారు.
గణేష్ మాట్లాడుతూ.. వాసవి యూత్ ఎన్నారై పలు సేవలతో ఆర్ధికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్ధులను
చదివించడం అభినందనీయమన్నారు. సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్, జయేష్ కొప్పర్తి, రఘురాం సందీప్ దిగ్గవల్లిని అభినందించారు. జూలూరు సురేష్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంస్థ
రానున్న 4,5 సంవత్సరాలలో గల్ఫ్ దేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని కోరారు.
గుండు హనుమంతరావు మాట్లాడుతూ.. ఆర్యవైశ్య కళాకారులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్థులకు, వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఆర్యవైష్యులను ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అలాగే ఆర్యవైశ్య విద్యార్దులను చదివించడం కూడా అభినందనీయమని, ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను
నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలియచేశారు.
ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులైన జయేష్ కొప్పర్తి, రఘురాం సందీప్ , జూలూరు సురేష్లు విచ్చేసిన అతిధులకు, స్పాన్లర్లకు కృతజ్ఞతలు తెలియచేశారు. రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు, సేవలు చేస్తామని తెలియచేశారు. జూలూరు హారిక , నరసింహారావు, అనిత, అవినాష్, దీపు, ప్రణీత్, రాజేష్, ప్రదీప్, సంధ్య, జయప్రద, విష్ణు, జూలూరు దినేష్, నళిని జూలూరు, కిశోర్, నాగార్జునలు ఈ కార్యక్రమానికి సహాయ
సహకారాలు అందచేశారు.












Click it and Unblock the Notifications