Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15వ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్: మూడవ రోజు ఇందిరా నూయీ డేవిడ్ మిచెల్ ఏం మాట్లాడారంటే..?

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ యొక్క 15వ ఎడిషన్, దాని సరికొత్త వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో శనివారం, మార్చి 5న అట్టహాసంగా ప్రారంభమైంది, 10-రోజుల ఈవెంట్‌లో రెండవ రోజు ఆలోచనాత్మక సంభాషణలను కలిగి ఉన్న స్పీకర్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

Recommended Video

    Why You Can’t Miss The Jaipur Literature Festival 2022 | Oneindia Telugu

    మూడవ రోజు ప్రధాన అంశాలు:

    పెప్సీ మాజీ సీఈఓ ఇందిరా నూయి మూడవ రోజు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. తాను రాసిన పుస్తకంలోని పలు అంశాలను ప్రస్తావించారు. ఆమె ఎదుర్కొన్న కష్టాలను తాను ఈస్థాయికి ఎలా చేరుకున్నారనే విషయాలను మాట్లాడారు. అంతేకాదు లింగ వివక్ష లాంటి అడ్డంకులను సైతం అధిగమించి తాను ఒక ప్రపంచ స్థాయి నాయకురాలిగా వ్యాపార రంగంలో నిలబడినట్లు చెప్పారు. ఓ వైపు తల్లిగా బాధ్యతలు మరోవైపు కార్పొరేట్ రంగంలో పెద్ద బాధ్యతలను బ్యాలన్స్ చేస్తూ ఎలా ఎదిగారన్నది ఆసక్తికరంగా చెప్పారు. అపర్ణా పిరమాల్ రాజేతో ఈ చర్చ సాగించారు.

    15th Jaipur Literature Festival: Watch Out for Indra Nooyi, David Mitchells Thoughtful Dialogues on Day 3

    ఇక బ్రిటీషు రచయిత డేవిడ్ మిచెల్ సామి బసుతో చర్చను కొనసాగించారు.ఇరు రచయితలు మిచెల్ కొత్త పుస్తకం యుతోపియా ఎవెన్యూపై చర్చిస్తారు.ఈ పుస్తకంలో 1960లో బ్రిటీష్ రాక్‌బ్యాండ్ యుతోపియా ఎవెన్యూ గురించి ఉంటుంది. ఇక ఈ ఈవెంట్స్‌లో చాలామంది ప్రేక్షకులు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై చర్చకోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల సామాజిక రాజకీయ, సాంస్కృతిక మరియు ఆర్థిక విధానాలపై చర్చ జరుగుతుంది.అంతేకాదు బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగి 50 ఏళ్లు ముగిసినందున ఈ సారి చర్చ మరింత ఆసక్తి కరంగా సాగనుంది.

    ఇక మరో సెషన్‌లో నోబెల్ పురస్కార గ్రహీత డేనియల్ ఖానేమాన్ మరో రచయిత ప్రొఫెసర్ ఒలీవియర్ సిబోనీ మరియు న్యాయకోవిదులు కాస్ ఆర్ సన్‌సెటిన్‌తో చర్చిస్తారు. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఎందుకు చాలా అనుమానాలు వస్తాయనే అంశంపై చర్చిస్తారు. ఇక రెండో రోజు దేశం యొక్క భవిష్యత్తు పై చర్చ జరిగింది. కొన్ని ప్రధాన అంశాలను లేవనెత్తారు. డాల్‌రింపుల్ అనే రచయిత అఫ్గానిస్తాన్ అంశంపై చర్చించారు. అక్కడ నెలకొన్న వివాదంను బెట్ డామ్ మరియు క్రిస్టీనా లాండ్ చాలా ధైర్యంగా కవర్ చేశారని కొనియాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై నాటో విఫలమైందని లాంబ్ అన్నారు.

    15th Jaipur Literature Festival: Watch Out for Indra Nooyi, David Mitchells Thoughtful Dialogues on Day 3

    కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, తన తాజా పుస్తకం 10 ఫ్లాష్‌పాయింట్స్ గురించి మిలన్ వైష్ణవ్, కార్నెగీ మెల్లన్‌లో సీనియర్ సహచరుడు మరియు దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్‌తో మాట్లాడారు. ఈ పుస్తకం గత రెండు దశాబ్దాలుగా భారత విదేశాంగ విధానంలో ఎదురవుతున్న సవాళ్లను అంతర్దృష్టితో పరిశీలించింది. ఇది రెండు శత్రు పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనా నుండి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతుంది. ఈ కార్యక్రమంలో తివారీ మాట్లాడుతూ, "జాతీయ భద్రత తప్పనిసరిగా ఆర్థిక సమస్యల వంటి పెద్ద సంఖ్యలో సమస్యలతో ముడిపడి ఉంది." అని చెప్పారు. భారత్‌ అభివృద్ధి చెందాలంటే 30 ఏళ్ల పాటు శాంతియుత వాతావరణంలో ఉండాలని చెబుతూ చైనా పాకిస్తాన్ లాంటి దేశాల పట్ల స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని చెప్పి ముగించారు.

    రిజిస్ట్రేషన్స్‌కు మరియు ఇతర సమాచారం కోసం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+