ముగింపు దశకు చేరిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్
జైపూర్ లిటరచర్ ఫెస్టివల్ 15వ ఎడిషన్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాల్లో 600 మంది స్పీకర్లు, ఆర్టిస్ట్లు, కళాకారులు భారత్ నుంచే కాక ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొన్నారు.
Recommended Video
భాష, యుద్ధం, రాజకీయాలు, పర్యావరణం నుండి వాతావరణ మార్పు, లింగ సమస్యలు, వ్యాపారం, సైన్స్ మరియు సాంకేతికత, చరిత్ర, సినిమా, కళ మరియు ప్రయాణం వంటి చర్చల నుండి, విభిన్న అంశాలపై ఆరోగ్యవంతమైన చర్చలు జరిగాయి. ముగింపు వేడుకలకు ముందు రోజు స్ఫూర్తినిచ్చే కొదరు ప్రముఖులు పాల్గొంటారు. వీరిలో ట్రైబ్ ఆమ్రపాలి సీఈఓ ఆకాంక్ష అరోరా, డిజైనర్ అనవిల మిశ్రా , రాజకీయనాయకురాలు స్మృతి ఇరానీ,పారిశ్రామికవేత్త హిమాంశు వర్ధన్లు కాలమిస్ట్ సీమా గోస్వామితో పలు అంశాలపై చర్చించారు.
ముందుగా మాట్లాడిన స్మృతి ఇరానీ భారత్ క్రాఫ్ట్ అండ్ టెక్స్టైల్ రంగంలో సుస్థిరత సాధించిందని చెప్పారు. ఇక చివరి రోజున జెనిల్ ధోలాకియా ప్రదర్శించిన నదా యోగ అందరినీ ఆకట్టుకుంది.ధోలాకియా అంతర్గత గొంతుకతో మంత్రాలను ఉచ్చరించారు. టిబెటియన్ సింగింగ్ బౌల్స్ ద్వారా చేసి హీలింగ్ వైబ్రేషన్ అందరినీ ఆకట్టుకుంది.
10వ రోజు రౌండప్
థౌంజెండ్ మైల్స్ అనే సెషన్లో ఫిల్మ్మేకర్ వినోద్ కాప్రి ప్రముఖ జర్నలిస్టు భర్కాదత్తో కలిసి మరో రచయిత చిన్మయ్ తుంబేతో కలిసి కోవిడ్ 19 మహమ్మారిపై చర్చించారు. ఆ సమయంలో కొన్ని లక్షల మంది వలసదారులు ఇరుక్కుపోయారని ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు.
అంతేకాదు చాలామంది ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని అట్టి వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టుకుపోయిందని చర్చించారు. ఈ సందర్భంగా కాప్రి వలసదారులపై చేసిన డాక్యుమెంట్ ప్రదర్శించారు. వారు పడిన ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చారు.ఇక భర్కా దత్ కొన్ని నెలల పాటు ఈ వలసదారుల యొక్క ఇబ్బందులను కవర్ చేస్తూ ప్రపంచానికి తెలియచెప్పారు.