గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ఆ ఎస్సై: అయినా ప్రమోషన్

రవి కుమార్ పాడేరు ఎస్సైగా ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ సిబ్బంది వాకపల్లి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 11 మంది గిరిజన మహిళలపై 2007 ఆగస్టు 20వ తేదీన గ్రేహౌండ్స్ సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. 11 మంది మహిళల్లో ఇద్దరు మహిళలు మరణించారు.
ప్రత్యేక పోలీసు బలగానికి చెందిన సిబ్బంది గ్రామస్థులపై దాడి చేసి, తుపాకులతో బెదిరించి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాల నాయకులు ఆందోళనలకు దిగడంతో రవిపై, మరో 12 మంది పోలీసులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా సాగుతోంది.
సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన అధికారికి ప్రమోషన్ ఇవ్వడం సరి కాదని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్ కృష్ణ అన్నారు. ఆరోపణలపై నిగ్గు తేలేవరకు రవి కుమార్ ప్రమోషన్ను పెండింగులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications