మద్యం తాగించి మహిళపై రేప్, ఆ తర్వాత హత్య

శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. శనివారం ఉదయం ఎరుకల కిష్టప్ప ఇంటి సమీపంలో మృతదేహంగా పడివుండటాన్ని స్థానికులు గమనించారు. నోటిలో గుడ్డలు కుక్కి, అ త్యాచారం చేసి, ఆపై హత్య చేసివుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరుకల కిష్ట, మరో యువకుడు ఆదినారాయణపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, వి చారిస్తున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరు న రసమ్మను అంట్లు తోమే పనుందని ఇంటికి పిలుచుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హతమార్చి, దగ్గరలోని ఓ మి ద్దెపై నుంచి కింద పడేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. విష యం తెలుసుకున్న కదిరి డీఎస్పీ కరీముల్లా షరీఫ్, నల్లమాడ సీఐ ఖాసీంసాహెబ్, ఎస్ఐ గణేష్, తహసీల్దార్ హుస్సేన్బాషా అక్కడికి చేరుకుని, వి చారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ చెప్పారు.
నరసమ్మ హత్యాచారంపై గ్రామస్థ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శి క్షించాలని కోరుతూ ఆందోళనకు దిగా రు. వారిని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. రోడ్డుపై నినాదాలు చేస్తూ ఐ దుగంటలపాటు బైఠాయించారు. నరసమ్మ కుటుంబానికి రూ.5 లక్షలు నగ దు, ఐదెకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications