సాహితీవేత్త గిడుగు కన్నుమూత

వ్యవహారిక భాషోద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తి మనవడైన రాజేశ్వరరావు పూలతేరు, కాళిందిలో వెన్నెల, మల్లెపందిరి, గిడుగు రాజేశ్వరరావు కథలు మొదలైన కథా సంపుటాలను, భావవీచికలు, రాగవీచికలు వంటి గేయసంపుటాలను వెలువరించారు.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు. పిల్లల కోసం గేయాలు, కథలు సైతం రాశారు. 'గిడుగురామ్మూర్తి జీవిత చరిత్ర'ను కూడా రాశారు. రాజేశ్వరరావుకు కూతురు స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు. రామదాసు ఢిల్లీలోనే రక్షణ శాఖలో న్యూరో సర్జన్గా పనిచేస్తుండగా కూతురు స్నేహలత గాయనిగా, వైణికురాలిగా పేరొందారు.
కాగా గిడుగు రాజేశ్వరరావు మృతి పట్ల మాజీ ఎన్నికల కమిషనర్ జివిజి కృష్ణమూర్తి, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, నేషనల్ బుక్ట్రస్ట్ సంపాదకుడు పత్తిపాక మోహన్, రచయితలు జేఎల్ రెడ్డి, సంపత్కుమార్. బాలగంగాధర్ తిలక్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహితీ ప్రపంచానికి తీరనిలోటని కాళీపట్నం రామారావు (కారా) అన్నారు.












Click it and Unblock the Notifications