మనిషి కంటికి చిక్కిన చంద్రుడి అసలు రహస్యం!
అనంత విశ్వంలో మనకు అత్యంత చేరువగా ఉంటూ, నిత్యం కవ్విస్తూ ఉండే చందమామ.. తన గుండెల్లో దాచుకున్న ఒక అపురూప దృశ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సరిగ్గా 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, చంద్రుడి పరిసరాల్లోకి వెళ్లిన మానవ నేత్రాలకు 'ఓరియంటాలే బేసిన్' (Orientale Basin) తన పూర్తి స్వరూపంతో సాక్షాత్కరించింది. ఏప్రిల్ 5, 2026న నాసా విడుదల చేసిన ఈ చారిత్రాత్మక చిత్రం, అంతరిక్ష అన్వేషణలో ఒక నవశకానికి నాంది పలికింది. 1972లో అపోలో 17 తర్వాత, మళ్లీ ఇప్పుడు ఆర్టెమిస్ రూపంలో మానవాళి జాబిల్లి అంచులను తాకింది.
తొలిసారిగా మానవ కళ్లకు.. 'ఓరియంటాలే' సౌందర్యం!
చంద్రుని ఉపరితలంపై కుడి అంచున ఉండే 'ఓరియంటాలే బేసిన్' ఒక అద్భుతమైన ఖగోళ వింత. గతంలో కొన్ని శాటిలైట్లు దీని చిత్రాలను తీసినప్పటికీ, ఒక మనిషి కంటితో ఈ బేసిన్ను పూర్తి వీక్షణతో చూడటం చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టెమిస్ II సిబ్బంది ఆదివారం ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. "మానవ నేత్రాలతో ఈ బేసిన్ను ఇలా సంపూర్ణంగా చూడటం ఇదే మొదటిసారి" అంటూ నాసా చేసిన 'ఎక్స్' (ట్విట్టర్) పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెండి వెన్నెల కాంతుల్లో మెరిసిపోతున్న చంద్రుడి ఉపరితలం, అందులోని లోయలు చూస్తుంటే దేవుడి సృష్టిలోని అపార సౌందర్యం కళ్ళముందు కదలాడుతోంది.

చరిత్ర సృష్టిస్తున్న నలుగురు 'అంతరిక్ష యోధులు'
ఈ సాహసోపేతమైన యాత్రలో ఒరియన్ (Orion) అంతరిక్ష నౌకలో నలుగురు ధీశాలులు ప్రయాణిస్తున్నారు. అమెరికాకు చెందిన విక్టర్ గ్లోవర్, రీడ్ వైస్మ్యాన్, క్రిస్టినా కోచ్లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ బృందంలో ఉన్నారు. వీరిలో క్రిస్టినా కోచ్ చంద్రుడి చెంతకు చేరిన మొదటి మహిళా వ్యోమగామిగా, విక్టర్ గ్లోవర్ మొదటి నల్లజాతి వ్యోమగామిగా చరిత్ర పుటల్లోకెక్కారు. వీరు కేవలం చంద్రుడిని చూడటమే కాదు, భవిష్యత్తులో అంగారకుడి (Mars) వైపు మానవుడు వేయబోయే అడుగులకు బలమైన పునాది వేస్తున్నారు.
రికార్డుల వేటలో 'ఒరియన్'.. అపోలోను మించి!
పది రోజుల పాటు సాగే ఈ మిషన్ లోతైన అంతరిక్షంలో మనిషి మనుగడ సాగించేందుకు అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఒరియన్ నౌక భూమి నుంచి సుమారు 2,52,000 మైళ్ల (4,00,000 కి.మీ) సుదూర ప్రాంతానికి చేరుకుని, మానవ సహిత అంతరిక్షయానంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో అపోలో 13 పేరిట ఉన్న రికార్డును ఇది అధిగమించబోతోంది. చంద్రుడిపై దిగకపోయినప్పటికీ, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అత్యంత క్లిష్టమైన వాతావరణంలో ఈ నౌక తన పటిష్టతను చాటుకుంటోంది.
అపోలో 17 నుంచి ఆర్టెమిస్ II వరకు.. 54 ఏళ్ల ప్రస్థానం
నాసా పంచుకున్న మరో ఆసక్తికర అంశం.. 1972 మరియు 2026 చిత్రాల పోలిక. అపోలో 17 సిబ్బంది తీసిన 'బ్లూ మార్బుల్' ఫోటోకు, ఇప్పుడు ఆర్టెమిస్ వ్యోమగాములు తీసిన ఫోటోకు మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసం అబ్బురపరుస్తోంది. అర శతాబ్ద కాలంలో మానవుడు సాధించిన ప్రగతికి ఈ చిత్రాలే నిదర్శనం. "ఆదివారం నాటికి ఆర్టెమిస్ II సిబ్బంది ఒక కలను జీవిస్తున్నారు.. చంద్రుడు తన అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తున్నాడు" అంటూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ వెండి వెన్నెల ప్రయాణం రేపటి తరం అంతరిక్ష అన్వేషకులకు ఒక గొప్ప స్ఫూర్తి కానుంది.
-
మనిషి కళ్లతో చూసిన అత్యంత అరుదైన భూమి దృశ్యం! -
ఐదు దశాబ్దాల అంతరిక్ష స్వప్నం! ఒకే భూమి.. రెండు భిన్న దృశ్యాలు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్













Click it and Unblock the Notifications