మనిషి కళ్లతో చూసిన అత్యంత అరుదైన భూమి దృశ్యం!
నీంగిలోకి దూసుకెళ్లిన 'ఒరియన్' వ్యోమనౌక అంతరిక్షంలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తన ప్రధాన ఇంజిన్ 'ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ బర్న్'ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే దిశగా కీలక అడుగు వేసింది. 1972లో జరిగిన అపోలో-17 మిషన్ తర్వాత, మళ్ళీ ఇప్పుడు నలుగురు వ్యోమగాములు భూమి కక్ష్యను దాటి చంద్రుడి వైపు పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి భూమి నెలవంకలా కనిపించడాన్ని గమనించిన ఒరియన్.. దాన్ని ఫోటో తీసింది. నిజంగా ఒక అపురూపమైన దృశ్యం.
ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా యొక్క శక్తివంతమైన ఎస్ఎల్ఎస్ (SLS) రాకెట్ ఒరియన్ వ్యోమనౌకను మోసుకెళ్తూ నింగిలోకి దూసుకెళ్లింది. నాసాకు చెందిన రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగస్వాములయ్యారు. అంతరిక్షంలోకి చేరుకున్న వెంటనే ఒరియన్ తన నాలుగు సోలార్ ప్యానెల్స్ ను తెరిచి సూర్యుడి నుంచి శక్తిని పొందడం ప్రారంభించింది. ఈ 10 రోజుల టెస్ట్ ఫ్లైట్ ద్వారా వ్యోమనౌక సామర్థ్యాన్ని, వ్యోమగాముల మనుగడకు అవసరమైన వ్యవస్థలను నాసా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

చంద్రుడి 'దూరపు తీరం'పై కన్నేసిన వ్యోమగాములు
మిషన్ ప్లాన్ ప్రకారం, ఏప్రిల్ 6 (సోమవారం) నాడు వ్యోమగాములు చంద్రుడికి అత్యంత సమీపంలోకి (లూనార్ ఫ్లైబై) వెళ్లనున్నారు. ఈ సమయంలో మానవ కళ్లకు నేరుగా కనిపించని చంద్రుడి అవతలి వైపు (Far Side) భాగాన్ని వారు వీక్షించనున్నారు. అక్కడి పర్వతాలు, లోయలు, క్రేటర్లను హై-రిజల్యూషన్ చిత్రాల రూపంలో బంధించనున్నారు. చంద్రుడిపై పడే సూర్యుడి నీడల సహాయంతో ఉపరితలంపై ఉన్న ఎత్తుపల్లాలను మరింత స్పష్టంగా అధ్యయనం చేసే అవకాశం ఈ మిషన్ ద్వారా లభిస్తుంది.
అంగారకుడి యాత్రకు ఇదే పునాది!
"మేము చేరుకునే ప్రతి మైలురాయి ఆర్టెమిస్ కార్యక్రమానికి ఒక గొప్ప పురోగతి. ఇది కేవలం చంద్రుడి యాత్ర మాత్రమే కాదు, భవిష్యత్తులో అంగారకుడి (Mars) పైకి మానవుడిని పంపే మహాత్కార్యానికి గట్టి పునాది" అని నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ లోరీ గ్లేజ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యోమగాములు అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడుతూ, వ్యాయామం, వ్యవస్థల తనిఖీల్లో నిమగ్నమయ్యారు.
చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసిన అనంతరం, ఈ నలుగురు వ్యోమగాములు శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అవ్వనున్నారు. ఈ మిషన్ పురోగతిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.
It’s not a straight shot to the far side of the Moon! 🌕
— NASA (@NASA) April 2, 2026
Over approximately 10 days, the Artemis II astronauts will orbit Earth twice before looping around the far side of the Moon in a figure eight and returning home. pic.twitter.com/udjejhxgVx
-
చంద్రుడి అవతలి రహస్యాల ఛేదన దిశగా నాసా- నిప్పులు చిమ్ముతూ జాబిల్లి వైపు -
చంద్రుడిపై శాశ్వత `గుడారం`- నాసా బిగ్ ప్లాన్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..














Click it and Unblock the Notifications